ముంబయ్: గురువారం స్టాక్ మార్కెట్ దారుణమైన పతనావస్ధతో ప్రారంభమైంది. నేడు సెషన్ ప్రారంభమైన మొదటి నిముషంలోనే 645 పాయింట్లను సెన్సెక్స్ కోల్పోయింది. నిఫ్టి కూడా 159 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఈ రోజే సెన్సెక్స్ పదివేల దిగువకు పడిపోయే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. రిలయెన్స్, ఎల్ అండ్ టి, హెడిఎఫ్ సి వంటి దిగ్గజాల షేర్లు నేటి ప్రారంభంలో 5 శాతం నష్టపోయాయి.