ఆంధ్రుల హత్యలపై విచారణకు లేఖ
న్యూయార్క్: అమెరికాలో వరుసగా జరుగుతున్న ఆంధ్రుల హత్యలపై అమెరికా హిందూ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ హత్యలపై విచారణ జరిపించాలంటూ అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐకు ఓ లేఖ రాసింది. 2007 డిసెంబరులో ఇద్దరు విద్యార్థుల హత్యతో మొదలైన ఈ పరంపర మొన్నటి శశాంక్ పై కాల్పుల వరకూ కొనసాగుతూనే ఉన్నదనీ, దీన్ని అరికట్టకపోతే భారత విద్యార్థులు, ఉద్యోగుల్లో అభద్రతాభావం పెరుగుతుందని హిందూ సంఘం జాతీయ కన్వీనర్ గోకుల్ ఎఫ్బీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అత్యున్నత దర్యాప్తు సంస్థ ఈ ఘటనలపై విచారణ జరిపి వాస్తవాలేమిటో వెల్లడించాలని ఆయన అభ్యర్థించారు.












Click it and Unblock the Notifications