చిరుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు

వరంగల్ జిల్లాలో రోడ్డు షోలో పాల్గొనేందుకు వచ్చిన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ఈనెల 3న ఉదయం కుమారస్వామి ఆధ్వర్యంలో ఫాతిమానగర్ వద్ద ప్లకార్డ్స్ పట్టుకుని కార్యకర్తలు చుట్టుముట్టారు. ఎస్సీల వర్గీకరణపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని చిరంజీవిని కోరారు. ఈ సందర్భంగా తనను తనతో పాటు వచ్చిన అందరినీ చిరంజీవి అవమానపరిచారని కుమారస్వామి కోర్టులో వేసిన పిటీషన్లో ఆరోపించారు. 'ఓహో దళితులా! మాదిగలా! ఐతే మీతో మాట్లాడవలసిన అవసరం నాకులేదు' అంటూ చిరంజీవి అవమానించారని ఆయన ఆరోపించారు. చిరంజీవి వాహనం హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన వడునూరి రాజేందర్ను ఢీకొట్టగా అతనికి గాయాలయ్యాయని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదుచేయగా వారు బాధితున్ని చికిత్స నిమిత్తం మహాత్మాగాంధీ ఆసుపత్రికి పంపించారని తెలిపారు.












Click it and Unblock the Notifications