భరోసాతో మీసం మెలేస్తా: చిరు

ప్రజారాజ్యం పార్టీని నడపడానికి ప్రజలు తనను సారథిగా ఎంచుకున్నారని, మహిళలు తన వెనక ఉన్నారని ఆయన అన్నారు. రాజకీయాలను శుద్ధి చేయడానికి ఒక వ్యక్తి కావాలని ప్రజలు తనను కోరుకున్నారని ఆయన అన్నారు. తనపై ప్రజలు పెద్ద బాధ్యత పెట్టారని ఆయన అన్నారు. స్వార్థం, సుఖం కోరుకోకుండా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తానని ఆయన చెప్పారు. ఇంద్ర సినిమాలో ఇంద్రసేనారెడ్డి కాశీ వదిలి సీమ గడ్డ మీద అడుగుపెట్టిన దృశ్యాన్ని చిత్రీకరించిన విషయం గుర్తుకొస్తోందని, దాన్ని తాను నిజజీవితంలో చూస్తున్నానని ఆయన అన్నారు. తనను ఎప్పటికప్పుడు తన బరువు, బాధ్యత హెచ్చరిస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు. తనను కుటుంబంలో పెద్దన్నయలా ప్రజలు ఆదరిస్తున్నారని, ఆత్మబంధువులా చూస్తున్నారని, ప్రజారాజ్యాన్ని గద్దెనెక్కించే బాధ్యత ప్రజలదని, ఆ తర్వాత వారికేమీ చేయాలో తాను చేస్తానని, ఆ లక్ష్యాన్ని సాధిస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications