వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడే దర్గాలో చిరంజీవి పూజలు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
కడప: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి శుక్రవారం ఉదయం కడప జిల్లాలోని బడే దర్గాను సందర్శించారు. ఆయన బడే దర్గాలో పూజలు చేశారు. రాయలసీమలో తన ప్రజా అంకిత యాత్రను కొనసాగిస్తున్న ఆయన శుక్రవారం ఉదయమే బడే దర్గాకు చేరుకున్నారు. చిరంజీవి రాయలసీమ పర్యటన శుక్రవారం ముగుస్తుంది. కడప జిల్లాలోని ఈ అమీర్ పీర్ దర్గా విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అక్కడి నుంచి ఆయన రోడ్ షోకు బయలుదేరారు.

అనంతపురం జిల్లా నుంచి చిరంజీవి రాయలసీమలో తన ప్రజా అంకిత యాత్రను ప్రారంభించారు. అనంతరం కడప జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో తొడ కొట్టారు, మీసం మెలేశారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు కురిపించారు. యాత్ర ప్రారంభంలో ఆయన విమర్శలు సుతిమెత్తగానే చేశారు. ఆ తర్వాత ఘాటు విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X