వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్ షోలపై హైకోర్టు స్టే
హైదరాబాద్: వివిధ రాజకీయ పార్టీల రోడ్ షోలపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో అన్ని పార్టీలను, ప్రభుత్వాన్ని కోర్టు ప్రతివాదులుగా చేర్చింది. పార్టీల రోడ్ షోల కంటే జనం ప్రాణాలు ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. దీనితో త్వరలో మరో విడత రోడ్ షోలు నిర్వహించాలనుకుంటున్న చిరంజీవికి బ్రేకులు పడ్డాయి.
రోడ్ షోలలో అమాయక జనం మరణిస్తున్నారని, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అభిప్రాయ్ అనే స్వచ్చంద సంస్ధ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై నేడు జస్టిస్ అనిల్ రమేష్ దవే, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఈ స్టే ఇచ్చింది. ఈ కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది. ఆ లోపు ఆయా పార్టీలు కోర్టుకు కౌంటర్ లను దాఖలు చేయవలసి ఉంటుంది.
Story first published: Tuesday, November 25, 2008, 17:48 [IST]