వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1993 పేలుళ్ల కొనసాగింపే: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

LK Advani
న్యూఢిల్లీ: గత రాత్రి జరిగిన ముంబయి దాడులు 10993 వరుస పేలుళ్ల కొనసాగింపేనని ప్రతిపక్ష నాయకుడు ఎల్. కె. అద్వానీ అన్నారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ప్రశాంతంగా ఉండాలని, మత సామరస్యాన్ని కాపాడాలని ఆయన గురువారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను, ప్రధాని మన్మోహన్ సింగ్ కలిసి ఈ రోజు గానీ, రేపు గానీ ముంబయి వెళ్తున్నట్లు ఆయన గురువారం ఉదయం విలేకరులతో చెప్పారు. ఇది ఒక సవాల్ అని, దేశమంతా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

గత రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడులకు కనీసం రెండు నెలల ప్రణాళిక అవసరమవుతుందని భద్రతా నిపుణులు అంటున్నట్లు ఆయన తెలిపారు. తాను ఉదయమే ముంబయి వెళ్లాలని అనుకున్నాని, అయితే ఆపరేషన్లు పూర్తయిన తర్వాతనే పర్యటన వల్ల ఉపయోగం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిందని, ఈలోగా తాను ప్రధానితో మాట్లాడానని, తనతో రావాలని ప్రధాని అడిగారని, తాను అంగీకరించానని ఆయన వివరించారు. టెర్రరిజానికి సంబంధించినంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జవాబు ఇవ్వాల్సి ఉంటుందని, అయితే వాటి గురించి మాట్లాడే సందర్భం ఇది కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X