వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసోం రైల్లో పేలుడు: ముగ్గురు మృతి
గౌహతి: అసోంలోని ఒక ప్యాసెంజర్ రైల్లో పేలుడు సంభవించి ముగ్గురు మరణించారు. మరో 30 మంది దాకా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మంగళవారం ఉదయం 7 గంటల 50 నిమిషాల ప్రాంతంలో జరిగింది. లామ్డింగ్ - తీన్ సూకియా ప్యాసెంజర్ రైల్లో ఈ పేలుడు సంభవించింది.
డిపూ రైల్వే స్టేషన్ వద్ద ఈ పేలుడు జరిగింది. దీంతో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. పేలుడుకు కారణాలు తెలియడం లేదు. పేలుళ్ల వెనక ఉగ్రవాద చర్యలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైల్లో బాంబు పెట్టారని డిఐజి చెప్పారు.
Comments
Story first published: Tuesday, December 2, 2008, 9:28 [IST]