వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లెఫ్ట్ నేతలతో చంద్రబాబు భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గురువారం ఉదయం వామపక్షాల జాతీయ నాయకులతో భేటీ అయ్యారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్షాల నేతలు తలపెట్టిన ధర్నాలో పాల్గొనడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. పనిలో పనిగా ఆయన సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ను, సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ ను కలుసుకున్నారు.

కారత్, బర్దన్ లతో చంద్రబాబు ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరిపారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో తృతీయ ప్రత్యామ్యాయం ఏర్పాటు అవకాశాలపై చర్చించారు. టీడీపీ, వామపక్షాల రాష్ట్ర నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X