వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే ఫ్లాట్ లోకి కరీనా, సైఫ్

By Staff
|
Google Oneindia TeluguNews

Kareena Kapoor
ముంబై‌: ఇక ఎంతో కాలం విడివిడిగా ఉండలేమని బాలీవుడ్ ప్రేమ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో వారిద్దరు కలిసి ఒకే అపార్ట్ మెంటులో జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. వారి కోసం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ బాంద్రాలో అపార్టుమెంటును డిజైన్ చేసిందట. తమ కోసం అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ తమ ఫ్లాట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేసిందని కరీనా కపూర్ చెప్పింది. అక్షయ్ కుమార్ తో కలిసి నటించడం సౌకర్యంగా ఉంటుందని, అక్షయ్ భార్య ట్వింకిల్ తనకు అత్యంత సన్నిహిత మిత్రురాలని ఆమె చెబుతోంది.

సైఫ్, కరీనాలు తమ ప్రేమ వ్యవహారాన్ని దాచుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించడం లేదు. అందరికీ తెలిసే విధంగానే వారు వ్యవహరిస్తున్నారు. అయితే సైఫ్ తో సినిమాలో రోమాన్స్ నడిపే అవకాశం కరీనాకు రాలేదు. తాషాన్, ఓంకార సినిమాల్లో వారిద్దరు నటించినప్పటికీ సినిమాల్లో వారి జోడీ వేరేగా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X