ఎమ్మార్పీయస్ ఆందోళనలు: ఉద్రిక్తతలు

Mandakrishna Madiga
హైదరాబాద్‌: ఎస్సీల వర్గీకరణపై పార్లమెంటులో వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలంటూ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ చేస్తున్న దీక్షకు మద్దతుగా కార్యకర్తలు పలురకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. బుధవారం మంత్రివర్గ సమావేశం ఉండటంతో మంత్రుల నివాసాలముందు వారు ధర్నాలు చేస్తున్నారు. వారు తగిన హామీ ఇచ్చేవరకు సమావేశానికి వెళ్లనివ్వమని హెచ్చరిస్తున్నారు. ఎమ్మార్పీయస్ కార్యకర్తలు మినిస్టర్స్ క్వార్టర్సులోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులకు, ఎమ్మార్పీయస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు మంత్రులను ఘెరావ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా వుంటే, మందకృష్ణ మాదిగ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారంనాడు మూడో రోజుకు చేరుకుంది.

మరోవైపు ఎల్బీస్టేడియం వద్ద ఇద్దరు ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ఫ్లడ్‌లైట్ల టవర్‌ ఎక్కారు. వర్గీకరణపై ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే కిందకు దూకుతామని బెదిరిస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణాపై పార్లమెంటులో బిల్లు పెట్టాలంటూ బుధవారం తెలంగాణా జిల్లాల్లో తెరాస, ఇతర పక్షాలు ఆందోళనకు దిగగా పార్లమెంటులో ఎస్సీల వర్గీకరణకు బిల్లు పెట్టాలంటూ రేపటినుంచి ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగనుంది. తమ కార్యకర్తలు రేపటినుంచి జాతీయ రహదారుల దిగ్భందం చేపడతారని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఎల్లుండినుంచి రైల్‌రోకోలు చేపడతామన్నారు. తమ డిమాండ్‌ నెరవేరేవరకు ఆందోళనబాట వీడమని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+