అవినీతి సొమ్ములో కొద్దిగా పెట్టినా..: చిరు

Chiranjeevi
నల్లగొండ: అవినీతి సొమ్ములో పాలకులు పది శాతం ఖర్చు పెట్టినా నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితులకు మంచి నీరు అందించవచ్చునని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయని ఆయన విమర్శించారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆయన గురువారం ప్రజా అంకిత సభలో ప్రసంగించారు. మంచినీరు లేక నల్లగొండ జిల్లాలోని ప్రజలు ఫ్లోరైడ్ తో అంగ వికలులవుతున్నారని, వారిని ప్రభుత్వాలు ఇప్పటికీ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. దోపిడీ సొమ్ములో ప్రభుత్వం కొద్దిగా వెచ్చించినా వారి సమస్య పరిష్కారమై ఉండేదని ఆయన అన్నారు. తాను ఫ్లోరైడ్ బాధితులను పరామర్శించి వారికి ఏం చేస్తానో వివరిస్తానని ఆయన చెప్పారు.

సామాజిక తెలంగాణ సాధనే తన ధ్యేయమని ఆయన చెప్పారు. ప్రజల్లోకి వచ్చిన తర్వాతనే తనలో కొత్త శక్తి, ఉత్సాహం వచ్చాయని ఆయన చెప్పుకున్నారు. ఈ శక్తి ఇస్తున్నవారందరికీ తాను రుణపడి ఉంటానని చెప్పారు. నల్గొండ జిల్లాకు ప్రధాన సమస్యలుగా మారిన తాగు, సాగునీటి సమస్యలను తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని చిరంజీవి చెప్పారు. రోడ్‌షోలపై న్యాయస్థానం అభ్యంతరం చెప్పడం వల్ల నాలుగువారాలపాటు ప్రజలకు దూరంగా ఉండాల్సి వచ్చిందనీ, దీనివల్ల తానెంతో లోటు అనుభవించానని చిరు చెప్పారు. నువ్వు సల్లగుండాలె అని నల్గొండ భూమి తనను దీవిస్తోందని చిరంజీవి చెప్పారు.

ఫ్లోరోసిస్‌ సమస్య బుష్‌ సొంత రాష్ట్రంలో కూడా ఉందనీ, అక్కడి ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేశారని చిరు చెప్పారు. ఇలాంటి సమస్యలను పట్టించుకోని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మీరెందుకు ప్రశ్నించరని చిరంజీవి జనాలనుద్దేశించి అన్నారు. వేసినవారికే ఓట్లు వేసి వారి నిర్లక్ష్యాన్ని ఎందుకు భరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే తాగు, సాగునీటి సమస్యలను వెంటనే తీరుస్తామనీ, ఫ్లోరోసిస్‌ బాధితులను ఆదుకుంటామని చిరంజీవి హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+