ఎలా అపర భగీరథుడు: వైయస్ పై చిరు

నల్లగొండ జిల్లాకు మంచినీళ్లు ఇవ్వలేనివారు అపర భగీరథుడని ఎలా అనిపించుకుంటారని ఆయన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఈ నాలుగున్నరేళ్లు ఏం చేస్తున్నారని ఆయన అడిగారు. నల్లగొండ జిల్లా గుక్కెడు నీళ్ల కోసం విలవిలలాడుతోందని ఆయన అన్నారు. ఫ్లోరైడ్ ప్రాంతాల ప్రజలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని ఆయన అన్నారు. తాను ప్రజాసమస్యలను పరిష్కరిస్తుందని, సమస్యలకు శాశ్వత పరిష్కారం ప్రజారాజ్యం వల్లనే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. యువశక్తిని ప్రభుత్వాలు ఉపయోగించుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు మీకు నీటి దాహమైతే నాకు అభిమాన దాహం ఉందని, మీ అభిమానంతో సౌకర్యవంతంగా ఉండేవాడినని, అయితే మీరు నన్ను ఆహ్వానించారని, ప్రజా సేవకు మీరు నాకు అవకాశం ఇచ్చారు. చిరంజీవి మా కోసం చేశాడని మీరు గుండెల్లో దాచుకోవాలని నా కోరిక అని ఆయన అన్నారు. తన జీవితాంతం ప్రజలకు సేవ చేస్తానని ఆయన చెప్పారు.
కేంద్రంలోనూ కాంగ్రెసు ప్రభుత్వమే, రాష్ట్రంలోనూ కాంగ్రెసు ప్రభుత్వమే ఉందని, అటువంటప్పుడు రోడ్లు వేయించడానికి ఇబ్బందేమిటని ఆయన అడిగారు. హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపుచ్చి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది ఆఖరు ఏడాది అని, అందుకే వారు ప్రజల వద్దకు వస్తున్నారని ఆయన ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications