వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి పార్టీలో ఇష్టారాజ్యం

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. జిల్లాల్లో కార్యకర్తలు రెండుగా విడిపోయి ఘర్షణకు దిగుతున్నాయి. పార్టీ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగుతున్నాయి. జిల్లా కమిటీల ఏర్పాటుతో ఈ విభేదాలు భగ్గుమంటున్నాయి. కమిటీల్లో స్థానం దక్కనివారు ప్రజారాజ్యం పార్టీ నాయకత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. సామాజిక న్యాయం జరగడం లేదని వారు విమర్శిస్తున్నారు. నిజామాబాద్ పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం పార్టీలోని ఒక వర్గం ధ్వంసం చేసింది. పార్టీ కార్యకర్తలకు, చిరంజీవి అభిమానులకు మధ్య ఘర్షణ చెలరేగింది.

విజయనగరం జిల్లాలోనూ విభేదాలు భగ్గుమన్నాయి. కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమం ఈ విభేదాలకు ఆజ్యం పోసింది. ఈ ధర్నా కార్యక్రమానికి ఒక వర్గం దూరంగా ఉంది. రాజకీయానుభవం లేని వారిని కమిటీల్లో వేశారని ఒక వర్గం విమర్శిస్తోంది. విశాఖపట్నంలో కూడా ఒక వర్గం ఆందోళనకు దిగింది. ఎస్సీలకు జిల్లా కమిటీలో ప్రాధాన్యం లేదని ఆ వర్గం విమర్శిస్తున్నారు. వరంగల్ లో జిల్లా కమిటీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో విభేదాలు భగ్గుమన్నాయి. కార్యకర్తలు రెండుగా విడిపోయి కొట్టుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X