వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైళ్లను అడ్డుకున్న ఎమ్మార్పీయస్

By Staff
|
Google Oneindia TeluguNews

Mandakrishna Madiga
హైదరాబాద్‌: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు శుక్రవారం ఉదయం రైల్‌రోకో కార్యక్రమం నిర్వహించారు. నాంపల్లిలో ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను వారు అడ్డుకున్నారు. చర్లపల్లిలో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్నారు. ఆందోళనకారులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. పలు జిల్లాకేంద్రాల్లో కూడా రైల్‌రోకోలు జరిగాయి. ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృఫ్ణ మాదిగ చేపట్టిన నిరాహారదీక్ష కూడా కొనసాగుతోంది. ఆయన దీక్ష శుక్రవారంనాటికి ఐదో రోజుకు చేరుకుంది.

ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బిల్లు ప్రవేశపెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని ఓడిస్తామని మందకృష్ణ మాదిగ చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తమకు ఇచ్చిన హామీ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బిల్లు ప్రతిపాదన జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బిల్లు ప్రతిపాదిస్తే తాము కాంగ్రెసును రాష్ట్రంలో గెలిపిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X