ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
నెల్లూరు: నెల్లూరులోని ముత్తుకూరు వెంకటేశ్వర కళాశాల విద్యార్థులు ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి మనస్తాపం చెందిన ఆ విద్యార్థులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు గత మూడు రోజులుగా దీక్షలుగా చేస్తున్నారు. అయితే కళాశాల యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ ఈ దీక్షలపై స్పందించడం లేదు.
ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక ఫిషరీస్ కాలేజీ ఇది. ఇక్కడ డిగ్రీలు పుచ్చుకున్న వారిని ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసరుగా నియమించే అవకాశం ఉంటుంది. అయితే, ఆ విధమైన నియామకాలు జరగడం లేదు. దాంతో విద్యార్థులు దీక్షలకు దిగారు. అలాగే, కళాశాలలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలున్నాయి. విద్యార్థుల దీక్షలపై కళాశాల ప్రిన్సిపాల్ మాట్లడడానికి నిరాకరిస్తున్నారు.