వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎమ్మెల్సీ విజయం స్ఫూర్తి: తెరాస
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి లక్ష్మణరావును గెలిపించి తెలంగాణా విద్యావంతులు ముక్కోటి ప్రజల ఆకాంక్షలను మరోమారు ప్రపంచానికి చాటి చెప్పారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల రామారావు అన్నారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో తెలంగాణా ఏర్పాటుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు. ఈనెల 29న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో జరిగే విద్యార్థి గర్జన పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈ బహిరంగసభలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించటంతోపాటు ప్రత్యేక రాష్ట్రంలో అనుసరించే విద్యా విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని రామారావు చెప్పారు.
Comments
Story first published: Friday, December 19, 2008, 16:46 [IST]