ఉండవల్లికు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, దేవాదాయశాఖ మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు(ఎంఎస్)లకు ఠాకూర్ హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆస్తుల విక్రయానికి సంబంధించి... శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన ఠాకూర్ హరిప్రసాద్ సంస్థను దేవాదాయశాఖ పరిధి నుంచి మినహాయింపునిస్తూ జారీ అయిన జీవో 622ను సవాలు చేస్తూ రాజమండ్రికి చెందిన మేడా శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ దావాను జస్టిస్ బి.ప్రకాష్రావు, జస్టిస్ విలాస్ అఫ్జల్ఫుర్కర్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 2005 మార్చిలో జారీ అయిన జీవో ఆధారంగా ఠాకూర్ హరిప్రసాద్ సంస్థ తన ఆస్తులను సత్యగోదావరి ఫౌండేషన్కు విక్రయించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.వి.రాజారాం తెలిపారు. జీవో విడుదలకు ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. సత్యగోదావరి ఫౌండేషన్ ఉండవల్లి వర్గీయులకు చెందినదని చెప్పారు. వాదనలను విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.