వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ అవినీతిపై చిరంజీవి నిప్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: నగర శివారులోని పటాన్ చెరులో సోమవారం జరిగిన ప్రజా అంకిత సభలో చిరంజీవి కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి మీదనే ప్రధానంగా విమర్శలు చేశారు. ముఖ్యంగా మత్స్యశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెలుగుబంటి సూర్యనారాయణకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణంలో పాత్ర ఉన్న మంత్రులను, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వెనకేసుకురావడం దారుణమని ఆయన అన్నారు. మంత్రుల అండ లేకుండా ఒక ఇంజినీరు కోట్లాది రూపాయలు దండుకోవడం సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు.

పటాన్ చెరుకు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని చిరంజీవి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇక్కది చెరువులు కలుషితమై పోయి రకరకాల రంగుల్లో కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న రైలు యాక్సిడెంట్ కు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు ఆ ఆదర్శాన్ని ఎందుకు పాటించరని ఆయన ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X