హైదరబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ..తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం ఫోన్ చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికే కేసీఆర్ ఫోన్ చేశారని తెరాస వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా 2009 సంవత్సరంలో రెండు పార్టీలు కల్సిపనిచేయాలన్న ఆకాంక్షను ఇద్దరూ వ్యక్తం చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 14వ తేదీ(సంక్రాంతి) తర్వాత తాము పొత్తులపై నిర్ణయం ప్రకటిస్తామని కేసీఆర్ చంద్రబాబునాయుడుతో చెప్పారు.