వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నార్కో టెస్ట్ తో మొద్దు శీను మర్డర్ మిస్టరీ
అనంతపురం :తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శీను అనంతపురం జిల్లా జైలులోనే హత్యకు గురి అయ్యాడు. ఓం ప్రకాష్ అనే తోటి ఖైదీ తనే స్వయంగా శీనుని హత్య చేసానని ఒప్పుకున్నాడు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో తెరవెనుక పాత్రల ప్రమేయంపై పలు సందేహాలు వ్యక్తమయ్యా యి. ఈ మేరకు పోలీసులు ఓ పిటిషన్ అనంతపురం కోర్టులో దాఖలు చేసారు. పరిశీలించిన కోర్టు, ఓం ప్రకాష్కు నార్కో పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది.దీనితో మొద్దు శీను హత్యకేసు మిస్టరీ వీడే అవకాశం కనిపిస్తున్నది.ఈ నేపథ్యంలో అంతటా ఈ నార్కో పరీక్షలపై ఉత్కంఠ నెలకొన్నది.
Comments
Story first published: Friday, January 2, 2009, 15:06 [IST]