నిరాహారదీక్షలతో గాంధీ ఆసుపత్రి
హైదరాబాద్: ఎప్పుడూ ఏదో వివాదంలో ఉండే గాంధీ ఆసుపత్రి ఇప్పుడు నిరాహాల దీక్షలతో వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ నాగరాజు ఏడాదిక్రితం పదవీవిరమణ చేసినా కాంట్రాక్ట్ పద్ధతిపై ప్రభుత్వం ఆయనను కొనసాగిస్తోంది. రేపటితో అదీ ముగియనుంది. తిరిగి ఆయన్నే కొనసాగిస్తారని ప్రచారం కావటంతో డాక్టర్లు ఈరోజు ఆందోళనకు మొదలైంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు వద్దని రెగ్యులర్ సూపరింటెండెంట్ను నియమించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర డాక్టర్ల సంఘం రిలే నిరాహారదీక్షలు చేపట్టంది.
Story first published: Friday, January 2, 2009, 14:42 [IST]