వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జమ్మూలో కాల్పులు కంటెన్యూ
జమ్మూ:'ఈ ఉదయాన్నే తిరిగి కాల్పులను పునరుద్ధరించారు. గుహల్లో దాక్కున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు సైన్యం మూడంచెల విధానాన్ని అవలంభిస్తోంది' అని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. జమ్మూ-కాశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత కోసం వేట కొనసాగుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులు ఐదోరోజైన సోమవారం కూడా కొనసాగుతున్నాయి.
భారీగా కురుస్తున్న పొగమంచు ఆపరేషన్కు ఇబ్బందిగా మారిందని పే ర్కొన్నాయి.ఇప్పటికి నలుగురు మిలిటెంట్లు, ముగ్గురు సైనికులు ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. లష్కరే తోయిబా, జైషె అహ్మద్ తీవ్రవాదసంస్థలకు చెందినవారు ఈ స్థావరాల్లో దాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు ముగ్గురు భద్రతాసిబ్బంది,నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు.
Story first published: Monday, January 5, 2009, 14:42 [IST]