వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసబ్ డీఎన్‌ఏ తో నిరూపిస్తాం

By Staff
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ:''దాడుల్లో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది కసబ్‌ మన అధీనంలో ఉన్నాడు. అతడి డీఎన్‌ఏ సేకరించి, పాక్‌లోని ఫరీద్‌కోట్‌లో కసబ్‌ తండ్రిగా చెబుతున్న వ్యక్తి డీఎన్‌ఏతో పోలుస్తాం. ఇందుకు వారి నుంచి ఓ వెంట్రుక లేదా కొద్దిగా లాలాజలం చాలు. ఎవరి వాదన వాస్తవమో ఫలితాలే చెబుతాయి'' అని హోంమంత్రి చిదంబరం పాక్ కు సవాల్ విసిరారు. దాడుల్లో సజీవంగా పట్టుబడిన అజ్మల్‌ కసబ్‌ తమ దేశ పౌరుడే అని పాక్‌ ఒప్పుకొన్నప్పుడే ఉమ్మడి దర్యాప్తునకు అర్థముంటుందని ఆయన చెప్పారు.

ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌కు ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. '' తీవ్రవాదులు పక్కా ప్రణాళికతో ముంబయిలో దాడులు చేశారు. ఈ స్థాయిలో దాడులకు తెగబడ్డారంటే వారికి అన్ని వైపుల నుంచి సాయం అంది ఉంటుంది. ఇది కేవలం ప్రభుత్వేతర శక్తుల పని కాదు. నిఘా, కమెండో ఆపరేషన్లు తెలిసిన వారు, వాటిపై పూర్తి అవగాహన ఉన్నవారే ఉగ్రవాదులకు మార్గదర్శనం చేసి ఉంటారు'' అని ఆయన స్పష్టం చేశారు.అంతేగాక దర్యాప్తులో భారత్‌కు అమెరికా పూర్తి తోడ్పాటును అందిస్తోందని తెలిపారు. తగిన ఆధారాలతో కొద్దిరోజుల్లో అమెరికాకు వెళ్లనున్నట్లు చెప్పారు ఆయన పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X