అర్ధరాత్రి నుండీ లారీల సమ్మె
హైదరాబాద్: దేశవ్యాప్తంగా లారీల సమ్మె గత అర్థరాత్రినుంచి ప్రారంభం అయింది. కేంద్రంతో జరిపిన చర్చలు విఫలం కావటంతో ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం ఈ బంద్ను పాటిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో 5.2 లక్షల వాహనాలు నిలిచిపోయాయి. డీజిల్ ధరను లీటరుకు 10 రూపాయల మేర తగ్గించటం, ఏకీకృథ పద్ధతిలో 4 శాతం వ్యాట్ విధింపు, రేడియల్ టైర్లపై ఆంక్షల తొలగింపు, టైర్ల ధరలను 35 శాతం మేర తగ్గించటం తదితర డిమాండ్లతో సమ్మె జరుగుతోంది.












Click it and Unblock the Notifications