హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణా అంశం తేలాలి:కాంగ్రేస్ సీనియర్లు

By Staff
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్‌:కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ ఈరోజు అల్పాహార విందు ఇచ్చారు.పార్టీలో సీనియర్లు తమ అభిప్రాయాలను సీఎం పట్టించుకోవటంలేదని, అధిష్టానం కూడా అదే బాటలో ఉందని అసంతృప్తితో ఉండటంతో వారంతా తమ అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు దీన్నో వేదికగా మార్చాలని ఆయన భావిస్తున్నారు.

ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను...తాజాగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన ఫలితాలను కురియన్‌కు వివరించాలని సీనియర్‌ నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం, అదేవిధంగా నిజామాబాద్‌ జిల్లా మాక్లూరు జడ్పీటీసీ స్థానాన్ని చేజార్చుకోవడం వంటి అంశాలను కురియన్‌ వద్ద ప్రస్తావించనున్నారు.

ఒంటరిగానే విజయం సాధిస్తామన్న వైఎస్‌ వాదనతో సీనియర్లు ఏకీభవించడం లేదు. ఇటీవల సాధించిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఉదాహరణగా వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లోగా పొత్తుల అంశంపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే దెబ్బతింటామని వారు చెబుతున్నారు.ఎన్నికల్లోగా తెలంగాణ అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని, లేకుంటే ఆ ప్రాంతంలో పార్టీ తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని వివరించేందుకు వారు సన్నద్ధమవుతున్నారు.

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల సమన్వయకర్త కురియన్‌ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు.ఈ ఏర్పాటు చేశారు. వీహెచ్‌, వెంకటస్వామి, నాదెండ్ల, నేదురుమిల్లి జనార్థనరెడ్డి, కేవీపీ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. సీఎం మాత్రం మరో అధికారిక కార్యక్రమం అదే సమయానికి ఉందంటూ హాజరుకాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X