వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పచ్చచొక్కాలు పందికొక్కుల్లా..వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
ఖమ్మం: పేదలను ఆదుకోవడానికి తెలుగు దేశం పార్టీ పనికి ఆహారపథకం పేరుతో రాష్ట్రానికి తెచ్చిన లక్షల టన్నుల బియ్యాన్ని పచ్చచొక్కాలు పందికొక్కుల్లా భోంచేశాయని ఆరోపించారు. నేడు కాంగ్రెస్‌ హయాంలో తెచ్చిన ఉపాధి హామీ పథకంలో గుత్తేదార్లు లేరని, పందికొక్కులూ లేవంటూనే నేరుగా కూలీల ఖాతాలకే సొమ్ములు చేరుతున్నాయని పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేళ్ల తెదేపా పాలనతో తన పాలనను పోల్చిచూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆయన ఆదివారం ఖమ్మం జిల్లా మధిర వచ్చారు. రాజమండ్రి నుంచి ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ను ట్రాక్టర్‌లో రేణుక తానే స్వయంగా నడుపుతూ ర్యాలీగా తీసుకెళ్లారు. రూ.100 కోట్ల విలువైన మూడు రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిలు, రూ.50 కోట్లతో వైరా రిజర్వాయర్‌ ఆధునికీకరణ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మధిరలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తూ తాము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలతో సహా చెప్పని వాటిని అమలు చేస్తున్నామన్నారు.

ఎంత ఖర్చయినా వెనుకాడకుండా రైతు సేద్యానికి అవసరమైన ప్రాజెక్టులను పూర్తిచేస్తామని ఉద్ఘాటించారు. తెదేపా హయాంలో సాగుకు నీరులేదని, పంటలకు గిట్టుబాటు ధరలేదని, తన పాలనాకాలంలో ఏడేళ్లపాటు కరవు కాటకాలు ఎదురైనా పేదలను ఆదుకుందామన్న కనీస ఇంగితజ్ఞానం చంద్రబాబుకు లేకుండా పోయిందని పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X