జడ్పీ ఫలితాలును పట్టించుకోం :డీఎస్

సమావేశానంతరం డీఎస్ మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉపఎన్నికల ఓటమి విషయం గురించి ఎటువంటి చర్చా జరగలేదని అన్నారు. కేవలం రాష్ట్ర పార్టీ వ్యవహారాలు, ఇతర ముఖ్య విషయాలపై మాత్రమే తాము కురియన్ తో చర్చలు జరిపినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు కంటే టీఆర్ఎస్తో పొత్తు పార్టీకి మేలు కలిగిస్తుందని సీనియర్లు కురియన్కు వివరించారు. టీడీపీ, వామపక్షాలు, టీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్కు ఇబ్బందులు తప్పవని చెప్పారు. అయితే సీనియర్ల అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి తెలుపుతానని కురియన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటస్వామి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, వి.హనుమంతరావు, కేవీపీ, అజీజ్ నర్సారెడ్డిలతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications