వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు ప్రమాదంలో ఇద్దరు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు జరిగిన ఓ రైలు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా 50 మంది వరకు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అలహాబాద్‌నుంచి ఫైజాబాద్‌ వెళుతున్న సరయు ఎక్స్‌ప్రెస్‌ బోగీలపై కొందరు విద్యార్థులు ఎక్కారు.

ఫైజాబాద్‌లో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ క్యాంప్‌లో పాల్గొనేందుకు గాను వారు వెళుతున్నారు. పైన కూర్చున్న వారికి ప్రతాప్‌గఢ్‌ సమీపంలో ఓ చెట్టుకొమ్మ అడ్డువచ్చింది. రైలు వేగంగా వెళుతుండటంతో చెట్టుకొమ్మ వేగంగా విద్యార్థులను కిందకు ఈడ్చేసింది. దీంతో వారంతా కిందపడ్డారు. ఇద్దరు మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X