వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైలు ప్రమాదంలో ఇద్దరు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఈరోజు జరిగిన ఓ రైలు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా 50 మంది వరకు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అలహాబాద్నుంచి ఫైజాబాద్ వెళుతున్న సరయు ఎక్స్ప్రెస్ బోగీలపై కొందరు విద్యార్థులు ఎక్కారు.
ఫైజాబాద్లో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ క్యాంప్లో పాల్గొనేందుకు గాను వారు వెళుతున్నారు. పైన కూర్చున్న వారికి ప్రతాప్గఢ్ సమీపంలో ఓ చెట్టుకొమ్మ అడ్డువచ్చింది. రైలు వేగంగా వెళుతుండటంతో చెట్టుకొమ్మ వేగంగా విద్యార్థులను కిందకు ఈడ్చేసింది. దీంతో వారంతా కిందపడ్డారు. ఇద్దరు మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు.
Comments
Story first published: Tuesday, January 20, 2009, 13:51 [IST]