హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమ టీడీపీ నేతలతో బాలయ్య భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్‌: రోడ్‌షోలకు సిద్ధమవుతున్న హీరో నందమూరి బాలకృష్ణ పలువురు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్‌ నేతలు కె.ఇ. కృష్ణమూర్తి, కంభంపాటి రామ్మోహనరావు, ప్రముఖ నిర్మాత మాగంటి గోపీనాథ్‌లతోపాటు అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల పార్టీ అధ్యక్షులు బాలయ్యతో భేటీ అయ్యారు.

ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బాలకృష్ణ పర్యటనపైనే ప్రధానంగా చర్చించారు. ఈ నెల 24వ తేదీన అనంతపురం జిల్లా వెంకటాపురంలో జరగనున్న పరిటాల రవి వర్ధంతి సభకు బాలయ్య హాజరు కాలేకపోతున్నందున.. రోడ్‌షో సందర్భంగా ఆ గ్రామాన్ని సందర్శించాలని బాలకృష్ట నిర్ణయించుకున్నారు.

29న అనంతపురం జిల్లా హిందూపురంలో బహిరంగ సభతో బాలయ్య రోడ్‌షో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి పరిటాల నియోజకవర్గమైన పెనుగొండలోకి ప్రవేశిస్తుంది. పరిటాల స్వగ్రామంలో జరిగే సభలో బాలయ్య ప్రసంగిస్తారు. మరోవైపు బాలయ్య పర్యటనలో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని బుధవారం నాటి భేటీ తర్వాత పార్టీ వర్గాలు తెలిపాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X