హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొయిలీతో టిఆర్‌ఎస్‌ అసమ్మతి నేతల భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్ చార్జి వీరప్ప మొయిలీతో టిఆర్‌ఎస్‌ అసమ్మతి ఎమ్మెల్యేలు గురువారం సమావేశమయ్యారు. మొయిలీని కలిసినవారిలో గీట్ల ముకుందారెడ్డి, దుగ్యాల శ్రీనివాస్‌, తూర్పు జయప్రకాష్‌రెడ్డి, కంభంపాటి లక్ష్మారెడ్డిలు ఉన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు తాము ఆకర్షితులయ్యామని అందుకే కాంగ్రెస్‌లో చేరనున్నామని, తమని పార్టీలో చేర్చుకోవాలని మొయిలీని కోరినట్లు తెలియవచ్చింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఆ సందర్భంగానే మొయిలీ నగరానికి వచ్చారు. నేడు వీరప్ప మొయిలీని కలిసిన వారిలో మాల మహానాడు అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావు కూడా ఉన్నారు. తనకు ప్రకాశం జిల్లాలో ఏదైనా ఒక అసెంబ్లీ స్ధానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇప్పించివలసిందిగా ఆయన మొయిలీని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X