మొయిలీతో టిఆర్ఎస్ అసమ్మతి నేతల భేటీ
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు తాము ఆకర్షితులయ్యామని అందుకే కాంగ్రెస్లో చేరనున్నామని, తమని పార్టీలో చేర్చుకోవాలని మొయిలీని కోరినట్లు తెలియవచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఆ సందర్భంగానే మొయిలీ నగరానికి వచ్చారు. నేడు వీరప్ప మొయిలీని కలిసిన వారిలో మాల మహానాడు అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావు కూడా ఉన్నారు. తనకు ప్రకాశం జిల్లాలో ఏదైనా ఒక అసెంబ్లీ స్ధానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇప్పించివలసిందిగా ఆయన మొయిలీని కోరారు.
Comments
Story first published: Thursday, January 22, 2009, 12:42 [IST]