అమెరికాలో ఆంధ్ర యువకుడి హత్య
హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మైఫాకు చెందిన రుద్రరాజు సుధీర్కుమార్(31)ను దుండగులు కాల్చి చంపారు. ఇతను అట్లాంటాలోని టయోటా మోటార్స్లో ఉద్యోగం చేస్తున్నాడు. డబ్బు కోసమే ఇతడిని హత్య చేసి ఉంటారని సమాచారం.
ఆరున్నర ఏళ్ల క్రితం అతను అమెరికా వెళ్లాడు. ఈ మధ్య మూడు నెలల అతను రాష్ట్రానికి వచ్చి వెళ్లాడు. గత రెండు రోజులుగా అతను మిత్రుల ఫోనుకు ప్రతిస్పందించడం లేదు. దీంతో వారు ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో వారు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచ్చి తలుపు తీసే చూసే సరికి అతను రక్తం మడుగులో పడి ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతనికి పెళ్లి కాలేదు.
Comments
Story first published: Wednesday, February 4, 2009, 17:20 [IST]