నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ గజదొంగ: చిరంజీవి

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గజదొంగగా మారిపోయారా అని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీతో తెరాస పొత్తు పెట్టుకోవడంపై ఆయన ఆ విధంగా ప్రతిస్పందించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన బుధవారంనాడు మిడియా ప్రతినిధులతో మాట్లాడారు. గతంలో కెసిఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని గజదొంగగా అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేస్తూ కెసిఆర్ గజదొంగగా మారిపోయారా, చంద్రబాబు మంచివారయ్యారా అని ఆయన అడిగారు.

తాము అధికారంలోకి వస్తే గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తమ పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన కేశినేని నాని కోవర్టు అని, అందుకే నాని ఆరోపణలు తాము పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తమకు ఎన్నికల సంఘం ఒకే గుర్తును ఇవ్వకపోతే న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X