ఎలుగుబంటి అవినీతిపై అసెంబ్లీ స్తంభన
హైదరాబాద్: మత్స్య శాఖ ఈఈ ఎలుగుబంటి సూర్యనారాయణ అవినీతిపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో బుధవారం శాసనసభా కార్యక్రమాలు స్తంభించాయి. ప్రతిపక్షాల సభ్యులు ఎంతకీ వినకపోవడంతో స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి సభను రేపటికి వాయిదా వేశారు. సూర్యనారాయణ అవినీతిపై ప్రభుత్వం తగిన సమాధానం ఇవ్వాలని, ముందు ఆ అంశంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనికి స్పందించిన ఆర్థిక మంత్రి రోశయ్య- ఒక్క సూర్యనారాయణ అవినీతిపైనే కాదు రాష్ట్రంలో జరిగిన అన్ని అవినీతి భాగోతాలపైనా చర్చిద్దామని అన్నారు. నోటీస్ లేకుండా చర్చకు అవకాశం లేదని, ఏదైనా చర్చించాలనుకుంటే ప్రశ్నోతరాల సమయం ముగిశాక ముందుగా నోటీస్ ఇచ్చి ఆ తర్వాత చర్చించాలని స్పీకర్ సురేష్రెడ్డి సభ్యులను కోరారు. ప్రతిపక్షాల సభ్యులు వినకపోవడంతో స్పీకర్ తొలుత సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
తిరిగి సమావేశమైన తర్వాత కూడా ప్రతిపక్షాల సభ్యులు సూర్యనారాయణ అవినీతిపై చర్చకు పట్టుబట్టారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పెట్టిన తర్వాత నోటీసు ఇస్తే సూర్యనారాయణ అవినీతిపై చర్చకు అనుమతిస్తానని స్పీకర్ చెప్పారు. అయినా ప్రతిపక్షాల సభ్యులు పట్టించుకోలేదు. దీంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications