వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యం స్కామ్ కాంగ్రెసుదే: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

LK Advani
విజయవాడ: సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం కాంగ్రెస్‌ నిర్వాకమేనని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ విమర్శించారు. అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ ప్రభుత్వమే ఎక్కువ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. సత్యం కుంభకోణం కార్పొరేట్‌ కుంభకోణం కాదని, కాంగ్రెస్‌ కుంభకోణమని, దీనివల్ల దేశ ప్రతిష్ఠ మసకబారిందని ఆయన విమర్శించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో యూపీఏ వంటి అసమర్థ ప్రభుత్వాన్ని తన జీవితకాలంలో చూడలేదని ఆయన అన్నారు. బుధవారం విజయవాడలో పార్టీ నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో అద్వానీ ప్రసంగించారు.

1952 నుంచి 2004 వరకు దేశంలో జరిగిన అన్ని ఎన్నికలూ చూశానని, అన్ని ప్రభుత్వాలనూ చూశానని, అందరు ప్రధానులూ తెలుసునని, ప్రస్తుతం ఉన్న యూపీఏ వంటి అసమర్థ ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, ఏ ప్రభుత్వమైనా సాధించిన విజయాలు ఒకటో రెండో ఉంటాయని, అసలేమీ సాధించకుండానే ఈ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తోందని ఆయన అన్నారు. ధరలు, రైతుల ఆత్మహత్యలు, అవినీతి, ద్రవ్యోల్బణాల్లో రికార్డులు సాధించిందని, నిరుద్యోగం, ఉద్యోగాలు కోల్పోవడం కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ అని ఆయన అన్నారు. ఈ సభలో బిజెపి సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తదితరులు ప్రసంగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X