వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సత్యం స్కామ్ కాంగ్రెసుదే: అద్వానీ
1952 నుంచి 2004 వరకు దేశంలో జరిగిన అన్ని ఎన్నికలూ చూశానని, అన్ని ప్రభుత్వాలనూ చూశానని, అందరు ప్రధానులూ తెలుసునని, ప్రస్తుతం ఉన్న యూపీఏ వంటి అసమర్థ ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, ఏ ప్రభుత్వమైనా సాధించిన విజయాలు ఒకటో రెండో ఉంటాయని, అసలేమీ సాధించకుండానే ఈ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తోందని ఆయన అన్నారు. ధరలు, రైతుల ఆత్మహత్యలు, అవినీతి, ద్రవ్యోల్బణాల్లో రికార్డులు సాధించిందని, నిరుద్యోగం, ఉద్యోగాలు కోల్పోవడం కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ అని ఆయన అన్నారు. ఈ సభలో బిజెపి సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తదితరులు ప్రసంగించారు.
Story first published: Thursday, February 5, 2009, 9:08 [IST]