వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్నేని సీతాదేవి ఇంట్లో చోరీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న మాజీ మంత్రి ఇంట్లో బంగారు ఆభరణాలు చోరికి అయ్యాయి. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మౌంట్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌ జి-8లో నివసించే మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి తన ఇంట్లో ఏసి రిపేరు, కార్పెంటర్‌ పనుల కోసం ఇరువురు యువకులను పిలిపించారు.

ఆమె భోజనానికి వెళ్లిన సమయంలో డ్రెస్సింగ్‌ టేబుల్‌లో ఉన్న రెండు బంగారు గాజులు, బాలాజీ లాకెట్‌ ఉన్న నల్లపూసల గొలుసు, డైమండ్‌ రింగ్‌ ఒకటి చోరికి గురయ్యాయి. విషయం గమనించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకులపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. చోరికి గురైన బంగారు వస్తువులు సుమారు 50 గ్రా ములు ఉంటాయని వారు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X