వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఆరాటం బాబు కోసమే: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YSR
హైదరాబాద్‌:ఉచిత కరెంటుకు తూట్లు పొడుస్తారేమోనని అనుమానం వ్యక్తంచేసిన సీపీఎం కార్యదర్శి బీవీ రాఘవులుపై ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాఘవులుది ప్రజా సంక్షేమకార్యక్రమాలను నీరుగార్చలన్న ఆలోచనేనని ఆరోపించారు. ఉచిత విద్యుత్‌ సరఫరాకు, కరెంటు ఛార్జీలు పెంచకపోవడానికి సీపీఎం నాయకులు అనుకూలమో వ్యతిరేకమో చెప్పాలని సవాల్‌చేశారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి విద్యుత్‌ మంత్రి షబ్బీర్‌ అలీతో అదనపు విద్యుత్‌ కొనుగోలు, కేంద్రం మద్దతుపై ఫోన్లో చర్చించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి ఐదేళ్లకు మాట మార్చడం, మిత్రుల్ని మార్చడం పనిగా పెట్టుకున్న సీపీఎం నేత రాఘవులు ఉచిత విద్యుత్‌ కొనసాగింపుపై విషప్రచారానికి తెర లేపారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఏదోవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి తీరాలని రాఘవులు ఆరాటపడుతున్నారని ఎద్దేవాచేశారు. రాఘవులు కలలు కల్లలవుతాయన్నారు.

గత ఐదేళ్లుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా 30లక్షల రైతులకు ఉచిత విద్యుత్‌ అందించడంతోపాటు రెండుకోట్ల మంది వినియోగదారులకు కరెంటు ఛార్జీలు పెంచలేదని ఆయన స్పష్టం చేశారు. ఇది తమ విశ్వసనీయతకు నిదర్శనమని, రాఘవులు చెబుతున్నట్లు ఉచిత విద్యుత్తు పథకం నీరుగార్చడం తమ హయాంలో జరగదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X