చిరంజీవికేం తెలుసు: చంద్రబాబు

వైయస్ ది మామూలు అవినీతి కాదని ఆయన అన్నారు. ఇది తప్పకుండా ఎన్నికల ఎజెండా అవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ అవినీతితో పాటు ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ఎన్నికల అంశాలు అవుతాయని ఆయన అన్నారు. వైయస్ కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన 14 సంస్థలపై విచారణ జరిపించకున్నా తమకు చెందిన హెరిటేజ్ పై విచారణ జరిపిస్తే మంచిదని ఆయన అన్నారు. బుధవారంనాడు తమను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు గురువారం ఉదయం హైదరాబాదులోని ట్యాంకుబండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం నుంచి శాసనసభ వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో చంద్రబాబు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications