వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ విలువలపై దాడి: రాష్ట్రపతి

By Staff
|
Google Oneindia TeluguNews

Pratibha Patil
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకే ఉగ్రవాదులు ముంబయిపై దాడి చేశారని ఆమె అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఉగ్రవాదుల దాడులు భారతీయ విలువలపై జరుగుతున్న దాడులుగా ఆమె అభివర్ణించారు. ఉగ్రవాదులను పాక్‌ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ఆమె గురువారం ప్రసంగించారు. ఆమె ప్రసంగంతో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. పాక్‌తో మనకు మాత్రమే కాదు ప్రపంచానికే ముప్పు వాటిల్లుతోందని అన్ని దేశాలు గుర్తించాయన్నారు. ముంబై దాడుల అనంతరం భారత్ కు ప్రపంచం మద్దతు లభించిందని ఆమె అన్నారు. కాశ్మీర్లో జరిగిన ఎన్నికలు తీవ్రవాదం ఓటమికి గుర్తు అన్నారు.

దేశం బహుముఖ అంతర్గత భద్రత సమస్యను ఎదుర్కుంటోందని ఆమె అన్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాదు, జైపూర్, బెంగుళూర్, అస్సాంల్లో ఉగ్రవాద సంఘటనలు జరిగాయని ఆమె అన్నారు. విచక్షణారహితమైన దాడుల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని ఆమె చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లోని వామపక్ష తీవ్రవాదం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు బలగాలను ఆధునీకరించడం ద్వారా, సామాజిక-ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దాన్ని ఎదుర్కుంటున్నామని ఆమె చెప్పారు. యుపిఏ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను ప్రస్తావించిన ఆమె ఇవన్నీ పేదల సంక్షేమంకోసమేనని వివరించారు. ఆర్థిక మాంద్యాన్ని అధిగమిస్తామని ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X