హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై వైయస్ పాత పాటే

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: తెలంగాణపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పాత పాట పాడారు. తెలంగాణపై ఆయన గురువారం శాసనసభలో ప్రకటన చేశారు. దీంతో రాజశేఖర రెడ్డి ప్రకటనను తెలంగాణపై కాంగ్రెసు వైఖరిగా తీసుకోవచ్చు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల లోపు తేల్చబోదని స్పష్టమైంది. శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటనా ప్రతులను తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు చించేశారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా తెరాస సభ్యులు నినాదాలు చేశారు. నినాదాల మధ్యనే ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేయడానికి ముందు రాజశేఖర రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, మిత్రుడు కెవిపి రామచందర్ రావులతో 40 నిమిషాల పాటు మంతనాలు జరిపారు.

తెలంగాణ సెంటిమెంటును కాంగ్రెసు పార్టీ గుర్తించిందని, ఈ అంశం భావోద్వేగమైందనే విషయాన్ని తాను, తమ కాంగ్రెసు పార్టీ అంగీకరిస్తున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణపై ఏకాభిప్రాయం కుదరలేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలా, మూడు ముక్కలు చేయాలా అనేది తేలలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు భద్రత ఉండదని ముస్లిం మైనారిటీలు అంటున్నారని, అదే సమయంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు వస్తున్నాయని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ విషయాలను పరిశీలించడానికి ఒక కమిటీ వేస్తామని ఆయన చెప్పారు. శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో ఈ కమిటీ వేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X