లంక జట్టుపై దాడికి భారత్ ఖండన
న్యూఢిల్లీ: పాకిస్థాన్లో శ్రీలంక క్రికెటర్లపై దుండగులు చేసిన దాడిని భారత్ ఖండించింది. గాయపడిన ఆటగాళ్లు త్వరగా కోలుకోవాలని బీసీసీఐ ఆశిస్తున్నట్లు తెలిపింది. ఆ దాడిపై భారత హోంమంత్రి చిదంబరం ఖండించారు.మరోవైపు లంక క్రికెటర్లపై దాడిని క్రికెట్ ఆస్ట్రేలియా దిగ్భ్రాంతి వ్యక్తిం చేసింది. ఈలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని సీఏ సీఈవో జేమ్స సుదర్లాండ్ అన్నారు. లంక ఆటగాళ్లు త్వరగా కోలుకోవాలని అన్నారు. ఈ ఘటన పట్ల న్యూజిలాండ్లో ఉన్న భారత ఆటగాళ్లు విచారం వ్యక్తం చేశారు. ఆ దాడికి నిరసనగా భారత-న్యూజిలాండ్ ఆటగాళ్లు నల్ల బ్యాడ్జిలు ధరించి మైదానంలోకి దిగారు. ఇక పాకిస్థాన్లో ఏ జట్టు పర్యటించదని ఆ దేశ మాజీ కెప్టెన్ ఇంజుమామ్ తెలిపారు.












Click it and Unblock the Notifications