హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధీ విగ్రహాలపై పడిన ఎమ్మార్పీస్

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీస్) కార్యకర్తలు మంగళవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఎమ్మార్పీస్ దాడులు ఉదృతం కావడంతో నూజివీడు, తిరువూరు బస్సు డిపోల నుంచి బస్సులు కదలడం లేదు.

ఇప్పటివరకు ఇందిరాగాంధీ విగ్రహాల ధ్వంసాలకు పాల్పడుతున్న ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు జాతిపిత మహాత్మాగాంధీని కూడా వదలటంలేదు. ఈరోజు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పరిధిలో రెండు చోట్ల వారు ఇందిర, మహాత్మాగాంధీ విగ్రహాలను ధ్వంసం చేశారు. హైదర్‌గూడలో వారు మహాత్మాగాంధీ విగ్రహాన్ని అత్తాపూర్‌లోఇందిరాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోతహశీల్దారు వాహనాన్ని ఇదే మండలంలోని విరూపాపురంలో మరో ఆర్టీసీ బస్సును ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు పెట్రోలు పోసి తగులబెట్టారు. దీంతో స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆదోనిలో డివిజనల్‌ పంచాయతీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో ఫర్నీచర్‌, కంప్యూటర్లు బూడిదయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X