హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు ఈ రోజు (బుధవారం) నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల దాకా పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది కొత్తగా ఇంటర్‌ మార్కులను ఎంసెట్‌కు వెయిటేజీగా నిర్ణయించడంతో పరీక్షల్లో అవకత వకలు జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్‌ నుంచి నాలుగు బృందాలు, ఇంటర్‌ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి నేతృత్వంలో ఆరు బృందాలు, ఇంటర్‌ బోర్డు నుంచి మరో నాలుగు, జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వం లోని హైవర్‌ కమిటీ కూడా తనిఖీలు జరుపనుంది.

పరీక్షా కేంద్రాల్లో తాగు నీటితో పాటు ప్రతి రెండు కేంద్రాలకు ఒక్కో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ను కిట్‌తో సహా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలు సందర్భంగా ఆయా పరీక్షా కేంద్రాలవద్ద 144 సెక్షన్‌ విధించారు. ఫస్టియర్‌ పరీక్షలకు తొలిరోజు 58,430 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. హైదరాబాద్‌ నగరంలో 159 కేంద్రాల్లో ఇవి జరగనున్నాయి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X