హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక కాంగ్రెస్‌ కు చమటలు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: మధ్యతరగతి, పేద ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తుండటంతో కాంగ్రెస్‌ కు చమటలు పడుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. మాగంటి బాబు తెదేపాలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, పీఆర్పీలను విమర్శించారు. కొత్త పార్టీ(పీఆర్‌పీ)కి మంచి ఆలోచనలు లేవని, పాత పార్టీ కాంగ్రెస్‌ అవినీతితో భ్రష్టు పట్టుపోయిందని, మళ్లీ తెదేపా వస్తేనే ప్రజలందరికీ మంచి జరుగుతుందని చెప్పారు.

అలాగే జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమని కాంగ్రెస్‌ కౌరవులు ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు అన్నారు. ప్రజలంతా ధర్మం పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. తమ నగదు బదిలీ పథకంతో కాంగ్రెస్‌ గుండెల్లో దడ పట్టుకుందని చెప్పారు. లక్ష కోట్ల రూపాయల అవినీతి సొమ్ము సంపాదించారని, ఈ లక్ష కోట్ల అవినీతిని నియంత్రిస్తే వచ్చే ఐదేళ్లపాటు నగదు బదిలీ పథకాన్ని బ్రహ్మండంగా అమలుచేయొచ్చని చెప్పారు. ప్రజలపై పన్నుల భారం వేయకుండా నగదు బదిలీ పథకాన్ని నూరు శాతం అమలు చేసి తీరతామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X