బాలయ్యవి పిల్ల చేష్టలు: దగ్గుబాటి

ఎన్టీ రామారావును గద్దె దించేందుకు అప్పట్లో తాను వైస్రాయ్ హోటల్ కు వెళ్లడం జీవితంలో తాను చేసిన పెద్ద తప్పు అని ఆయన అన్నారు. వైస్రాయ్ కి వెళ్లవద్దని పురంధేశ్వరి, శివశంకర్ కృష్ణ చెప్పినా తాను పెడచెవిన పెట్టానని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీ రామారావు కొనసాగుతారని, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని, హరికృష్ణను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తానని చంద్రబాబు అప్పుడు హామీ ఇచ్చారని, ఆ హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని, తమను మోసం చేశారని ఆయన అన్నారు. తాను చంద్రబాబుతో జత కట్టి పెద్ద తప్పు చేశానని అన్నారు.












Click it and Unblock the Notifications