బూతులు మాకు రావా: జూ.ఎన్టీఆర్

కాంగ్రెసుకు సంస్కారం లేదని ఆయన చెప్పారు. పివి నర్సింహారావును తమ తాత ఎన్టీ రామారావు గౌరవించిన తీరును వివరిస్తూ ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీకి ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసువారు రాజకీయాలంటే విరక్తి కలిగేలా, అసహ్యం పుట్టేలా చేశారని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో అవినీతిమయమైన కాంగ్రెసు ఓడించి, నీతివంతమైన తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెసు బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను అధికార కాంగ్రెసు పార్టీ బెదిరిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications