వైయస్ రాజీనామాకు చిరు డిమాండ్
హైదరాబాద్: టికెట్ల పంపకంలో మాట నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రాజీనామా చేయాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి డిమాండ్ చేశారు. 109 బిసి కులాలకు కాంగ్రెసు 66 సీట్లు మాత్రమే కేటాయించారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సామాజిక న్యాయం పాటించడంలో కాంగ్రెసు విఫలమైందని ఆయన విమర్శించారు. బిసిలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెసు ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేశారని, ఆ తీర్మానాన్ని వారే ఉల్లంఘించారని ఆయన అన్నారు. తాము సామాజిక న్యాయ ఎజెండాను తీసుకోగానే బిసిలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల ఎజెండాను కాంగ్రెసు ముందుకు తెచ్చిందని, ఇప్పుడు టికెట్ల కేటాయింపులో అన్యాయం చేశారని ఆయన అన్నారు.
చిరంజీవిని ప్రజలు నమ్మబోరని కాంగ్రెసు నాయకులు అంటున్నారని, కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏమిటో, వారి మాటలకు విశ్వసనీయత ఎంత ఉందో టికెట్ల పంపకంతో రుజువైందని ఆయన అన్నారు. తాను తిరుపతి నుంచి, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పారు. మూడో స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంటే నల్లగొండ నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా విజయభేరిని విజయవంతం చేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ విజయం ఖాయమని, ప్రజా విజయభేరి ద్వారా ప్రజలు ఆ సంకేతాన్ని ఇచ్చారని ఆయన అన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications