మా అక్కను ఓడించండి: బాలయ్య

'మా అక్కగారు పెద్దావిడ. ప్రతిభావంతురాలు. ఆమెపై నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఆమె కాంగ్రెస్ ను ఎంచుకోవడం దురదృష్టకరం. వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ఎన్టీఆర్తో పోల్చడం సిగ్గుచేటు. వైఎస్లా మా నాన్న ఫ్యాక్షనిస్టూ కాదు. అవినీతిపరుడు అసలే కాదు' అని ఆయన అన్నారు. ఇందిర, రాజీవ్ హత్యలు జరిగినప్పుడు ఎలాంటి సంబంధం లేకపోయినా ఎన్టీఆర్ పైనా ఆయన ఆస్తుల పైనా కాంగ్రెస్ వాళ్లు దాడులు చేశారని, పురంధేశ్వరి ఇప్పుడు అలాంటి పార్టీలో చేరి ఆ నేతలను పొగడటం సరి కాదని బాలకృష్ణ అన్నారు.
'యుద్ధం మొదలైంది, జబ్జలు చరచండి. అవినీతిపరుల్ని కత్తులతో కాదు కంటిచూపుతో చంపేద్దాం. మీరు తెలుగుదేశానికి వేసే ప్రతి ఓటూ కాంగ్రెస్ పార్టీ గుండెలపై సమ్మెట పోటు కావాలి' ానయ పిలుపునిచ్చారు.'కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. సామాజిక న్యాయం చేస్తామని, మార్పు తెస్తామని ఏదేదో చెబుతున్నాయి. ప్రజలు మార్పు కోరుతున్నారో లేదో గానీ ఆ పార్టీ నాయకులు మాత్రం మార్పు కోరుకుంటున్నారు. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ప్రజారాజ్యం అధినేత ప్రజలు కోరితే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్నారు. అదే నిజమైతే ప్రజల నుంచినాయకుల్ని తయారు చేయాలే తప్ప, వలసల్ని ప్రోత్సహించకూడదు కదా.! ఆ పార్టీలో ప్రస్తుతం అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి' అని ఆయన ప్రజారాజ్యం పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రజారాజ్యం నేతలు అధికారంలోకి రాకముందే కోట్ల రూపాయలు సంపాదించేశారన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications