Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వారి గుండెల్లో రైళ్లు: చిరంజీవి

Chiranjeevi
విశాఖపట్నం: తమ పార్టీ ప్రభంజనం చూసి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. సామాజిక న్యాయాన్ని తాము ఆచరించి చూపామని, ఆ పార్టీలు బిసిలకు టిక్కెట్లు ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదని, వారు బడుగువర్గాలకు రాజ్యాధికారం ఇవ్వబోవని ఆయన అన్నారు. తనకు ప్రజలు చారిత్రాకమైన అవకాశం ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని శ్రీహరిపురం బహిరంగ సభలో ఆయన సోమవారం ప్రసంగించారు. అభివృద్ధి చూసి తాను హాయిగా నిద్రపోతున్నానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అనడాన్ని ప్రస్తావిస్తూ ప్రజలు కడుపు నిండా తిని హాయిగా నిద్రపోతున్నారా అనే విషయం ముఖ్యమంత్రికి పట్టలేదని ఆయన అన్నారు. ఎంత మంది మహిళలను లక్షాధికారులను చేశారో లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పథకాల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన విమర్శించారు. ప్రజల కష్టాలు ప్రభుత్వానికి పట్టలేదని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని, అయితే వాటిలో అవినీతి లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రజలను సవతి బిడ్డలుగా చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల పాట్లు కాంగ్రెసు పార్టీకి పట్టడం లేదని ఆయన అన్నారు. తమ భవిష్యత్తుపై తప్పుడు అంచనాలు వేస్తున్నారని ఆయన అన్నారు. తమ సభలకు ప్రజలు ప్రభంజనంలా వస్తున్నారని, చిరంజీవికి అవకాశమిస్తామని ప్రజలు అంటున్నారని, తాము ఎదురులేని శక్తిగా ముందుకు వస్తామని, తాము అధికారం చేపడతామని ఆయన అన్నారు. ఇందిరమ్మ పథకంపై ఆయన విమర్శలు గుప్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+