Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిరు పార్టీపై వారిద్దరి కుట్ర: దేవేందర్

Devender Goud
హైదరాబాద్: చిరంజీవి నాయకత్వంలోని తమ పార్టీపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుట్ర చేశారని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు టి.దేవేందర్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రజల్లో విశ్వసనీయతను దెబ్బ తీయడానికి వారిద్దరు కుట్ర చేస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. వారిద్దరు తమ పార్టీ పట్ల కుటిల రాజకీయ నీతిని అవలంబిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీపై ప్రజల్లో అనుమానాలు కలిగేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రాన్ని చంద్రబాబు, వైయస్ తమ జాగీర్ గా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. బతికున్నంత వరకు తామిద్దరిలో ఎవరో ఒకరం మాత్రమే రాష్ట్రాన్ని పాలించాలనేది వారి ఉద్దేశమని ఆయన అన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు పాలన సాగించారని, ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన అన్నారు. వైయస్ ఐదేళ్లు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు.వైయస్ రాజశేఖర రెడ్డి దొరికింది దొరికినట్లు దోచుకు తిన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు వారి జాగీరదారీ మనస్తత్వాన్ని సహించబోరని ఆయన అన్నారు. వారిద్దరి పట్ల ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+